పుట్టపర్తి చుట్టూ పోలీసుల నిఘా నేత్రాలు
ఐజీ సంతోష్కుమార్ మెహ్రా, ఎస్పీ మనీష్ కుమార్ సిన్హా నిరంతరం పోలీసులతో వాకబు చేస్తూ పుట్టపర్తి భద్రతపై నిఘా పెంచారు. వారంలో రెండుమూడు రోజులపాటు వందమందికి పైగా భద్రతా బలగాలతో నిత్యం సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు గురువారం పుట్టపర్తికి వచ్చే ప్రధాన రహదారుల్లో తాత్కాలిక చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహించారు.
అదేవిధంగా స్థానిక లాడ్జ్ లు, అపార్ట్ మెంట్ లు, విదేశీయుల వసతి, విడిది గృహాల్లో సైతం విస్తృతంగా తనిఖీలు చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కర్ణాటక నాగేపల్లి జంక్షన్, ఎనుములపల్లి గణేష్ సర్కిల్, ప్రశాంతినిలయం తదితర చోట్ల ముమ్మరంగా తనిఖీలు చేశారు. పుట్టపర్తికి వచ్చే భక్తులు, పర్యాటకులను, వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గురువారం జరిగిన నాకాబందీలో సీఐలు రామక్రిష్ణయ్య, విఠలేశ్వర్ రావు, ఎస్ఐ రామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.