హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షోయబ్ తో ఓకే గదిలో.. ఆయేషా సిగ్గులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Ayesha-Shoaib Malik
కరాచి: షోయబ్, తాను హైదరాబాద్‌లో ఒకే గదిలో గడిపామనేందుకు సాక్షులున్నారని ఆయేషా సిద్ధిఖీ మరో బాంబు పేల్చింది. ఆమె శనివారం జియో టీవీతో మాట్లాడింది. "పెళ్లయ్యాక మీరు కలిసి ఉన్నారా అని అడిగితే... ఎస్! దురదృష్టవశాత్తూ మేం కలిసి ఉన్నాం. హైదరాబాద్‌లోని తాజ్ రెసిడెన్సీ (గతంలో హాలిడే ఇన్) మేం రెండుమార్లు కలుసుకున్నాం. దీనిని నిరూపించగలను. అప్పట్లో రూమ్ సర్వీస్ అందించిన ఇద్దరు సిబ్బందే దీనికి సాక్ష్యం. నిజం చెప్పేందుకు వారు అంగీకరించారు'' అని వివరించింది.

వారి పేర్లను బయటపెట్టేందుకు ఆయేషా నిరాకరించింది. షోయబ్ తండ్రి చాలా మంచివ్యక్తి అని, ఆయన జీవించినంత కాలం తనకు అండగా నిలిచారని తెలిపింది. 'తండ్రి మరణించగానే షోయబ్ మారిపోయాడు' అని ఆరోపించింది. మరోవైపు... తాజా వివాదాల నేపథ్యంలో పెళ్లిని హైదరాబాద్‌లో కాకుండా దుబాయ్‌లో జరపాలని షోయబ్ కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు పాకిస్థాన్‌కు చెందిన 'జియో టీవీ' తెలిపింది. ఈ వివాహంపై శివసేన బాల్‌ఠాక్రే చేసిన వ్యాఖ్యలతో వీరు బెంబేలెత్తినట్లు సమీప బంధువు ఒకరు చెప్పినట్లు పేర్కొంది. అయితే... ఇదంతా నిజం కాదని ఆ తర్వాత స్పష్టమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X