వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పితృత్వ కేసు: తివారీ వివరణ అడిగిన కోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

ND Tiwari
న్యూఢిల్లీ: పితృత్వం కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీని ఢిల్లీ హైకోర్టు బుధవారం వివరణ అడిగిది. ఆయన వివరణకు ఇదే అఖరి అవకాశమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. డిఎన్ఎ పరీక్షకు తివారీ ఎందుకు అంగీకరించడం లేదో తెలపాలని కోర్టు అడిగింది. ఎన్డీ తివారీని తన తండ్రిగా ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ అనే యువకుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తమకు సమర్పించిన ఫొటోలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు తివారీకి ఆదేశాలు జారీ చేసింది.

వివరణ ఇవ్వలేకపోతే స్వయంగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. తివారీ వివరణ ఇవ్వకపోవడం వల్లనే వివాదం తలెత్తుతోందని, వివరణ ఇస్తే వివాదం ముగుస్తుందని జస్టిస్ జీఆర్ మిధా అన్నారు. వివరణ ఇవ్వకపోతే మే 20వ తేదీన తివారీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X