బెంగళూరు: అత్యాచార ఆరోపణలు సహా తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టి వేయాలని కోరుతూ నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ అరలి నాగరాజ్ మంగళవారం విచారణ చేపట్టినప్పుడు ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాలతో కూడిన జాబితాను సమర్పించారు. దీంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.
ఇదే విషయంలో గతంలో నిత్యానంద కింది కోర్టుకు పెట్టుకున్న పిటిషన్ ను కొటివేసిన విషయం తెలిసిందే. నిత్యానంద నెల రోజుల క్రితం సినీనటి రంజితతఓ రాసలీలలు జరుపుతూ వీడియోకు దొరికిపోవడం, అవి టీవీ చానళ్ళలో ప్రసారం కావడం తెలిసిందే. అప్పటి నుంచి నిత్యానంద కన్పించకుండా వెళ్ళిపోయారు.