విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'బ్రాహ్మణులే అమ్మవారి లడ్డూలు చేయాలా?'

By Santaram
|
Google Oneindia TeluguNews

Kanakadurga Temple
విజయవాడ: కనదుర్గమ్మ ఆలయంలో కుల వివక్షపై దళిత సంఘాలు తీవ్రంగా నిరసించాయి. అమ్మవారి లడ్డు ప్రసాదం, పులిహోర, చక్కెరపొంగలి బ్రాహ్మణ కులస్తులు చేస్తేనే శుచి, శుభ్రత ఉంటుందని చెబుతూ తోటి బ్రాహ్మణేతర కార్మికులను పనుల నుంచి తొలగించాలని నిర్ణయించడం వారి మనోభావాలను దెబ్బతీయడమేనని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) నగర కార్యదర్శి జీ నటరాజ్‌ అన్నారు. హిందూ దేవాలయాల్లో వివక్ష అంశంపై ప్రెస్‌క్లబ్‌లో కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితవాడల్లో దేవాలయాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వమే ఇలాంటి వివక్ష చూపడం సమంజసం కాదన్నారు. ద్రవిడ సత్తా రాష్ట్ర కన్వీనర్‌ పీరత్నరాజు మాట్లాడుతూ శ్రామికుడికి కులం, మతం పట్టింపులు ఉండవన్నారు. మాలమహానాడు నగర అధ్యక్షుడు దాసి కెనడీ మాట్లాడుతూ దళిత, గిరిజన వెనుకబడిన వర్గాలకు పని భద్రత కల్పించాలన్నారు.

దళిత సేన రాష్త్ర కార్యదర్శి డీ ప్రేమకుమార్‌, రజకవృత్తిదారు సంఘం నగర కార్యదర్శి కే సత్యనారాయణ, ఎమ్మార్పీఎస్‌ నగర అధ్యక్షుడు మానికొండ శ్రీధర్‌, ఐద్వా నగర కార్యదర్శి కే శ్రీదేవి, బీజేపీ నగర అధ్యక్షురాలు బీ నాగలకి, కేవీపీఎస్‌ నగర కార్యదర్శి పీ రాజేష్‌, చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్‌ చల్లారి సుబ్బారావు, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి పీ ప్రవీణ్‌, మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యదర్శి ఎం. డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X