వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూర్పు ఏజెన్సీలో దంతెవాడ ప్రకంపనలు

By Santaram
|
Google Oneindia TeluguNews

East Godavari Dist
రంపచోడవరం: నిన్న మావోయిస్టులుదాడి చేసిన చత్తిస్ గఢ్ దంతెవాడ ప్రదేశం రాష్ర్ట సరిహద్దులను ఆనుకుని ఉన్న ఖమ్మం జిల్లాతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు కూడా దగ్గరగా ఉంది. జిల్లా సరిహద్దులలో 1000 మందికి పైగా మావోలు దాడిలో పాల్గొనటం, దాడి చేసిన అటవీ ప్రాంత, భౌగోళిక స్థితులు కూడా తూర్పు ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరగానే ఉంటాయి. గత నెలలో ఎస్‌కౌంటర్‌ లో మరణించిన మావోయిస్టు నేతల డైరీల ఆధారంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి తీరప్రాంతలో మావోయిస్టుల డంప్ ‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మావోయిస్టులకు తూర్పు, పశ్చిమ గోదావరి సరిహద్దులు సేఫ్టిజోన్ ‌గా ఉన్నాయా? అనేది చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో చత్తీస్‌ఘడ్‌ సరిహద్దులుగా ఉన్న తూర్పు ఏజెన్సీ పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది.

తూర్పు సరిహద్దు గ్రామాలకు ఒరిస్సా, చత్తీస్‌ఘడ్‌లకు చెందిన పలువురు గిరిజనుల వలస వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే మావోయిస్టులకు వలస వచ్చిన గిరిజనులు అండగా ఉంటున్నారనే ప్రచారంతో, ఎంతో కాలంగా తూర్పు ఏజెన్సీ పోలీసులు ఆ దిశగా తమ పావులు కదుపుతూ ఉన్నారు. తూర్పు ఏజెన్సీలో గిరిజనులకు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయటంలో ఐటిడిఎ, గ్రామాలలో గిరిజనులతో వ్యవహరించాల్సి తీరులో మార్పులు చేసుకుంటూ పోలిసులు వ్యవహరిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X