వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

19 తర్వాత పార్టీలతో భేటీ: దుగ్గల్

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Duggal
హైదరాబాద్: ఈ నెల 19వ తేదీ తర్వాత రాజకీయ పార్టీలతో సంప్రదింపులు ప్రారంభిస్తామని శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ చెప్పారు. మొదట రాజకీయ పార్టీలు, ఆ తర్వాత విధివిధానాల్లో పేర్కొన్న వర్గాలు, అనంతరం మేధావులు, ప్రముఖులతో భేటీ అవుతామని ఆయన చెప్పారు. కమిటీకి విలువైన సమాచారం అందించినవారితో కచ్చితంగా సంప్రదింపులు జరుపుతామని ఆయన చెప్పారు. జులై చివరినాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలనేది తమ ఉద్దేశమని ఆయన చెప్పారు.

తమకు ఇప్పటి వరకు 50 వేలకు పైగా నివేదికలు అందాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఇంకా పెద్ద యెత్తున నివేదికలు వస్తున్నాయని ఆయన చెప్పారు. వాటిలో 95 శాతం ఒకటి రెండు కాగితాలకే పరిమితమయ్యాయని, మిగతా ఐదు శాతం విలువైన సమాచారంతో, లోతైన అధ్యయనంతో ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐల నుంచి అధికారిక నివేదికలు అందాయని, తెలుగుదేశం, సిపిఎం కొంత సమయం అడిగాయని ఆయన చెప్పారు. గడువులోగా వాటి నుంచి నివేదికలు వస్తాయని అనుకుంటున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X