అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అతని అక్రమాస్తులు 3 కోట్లపైనే

By Pratap
|
Google Oneindia TeluguNews

Anantapur
అనంతపురం: అనంతపురంలోని హెచ్ సిఎల్ డిఇ ఖలీముల్లా ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించారు. జిల్లాలోని తాడిపత్రిలో గల ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలు రావడంతో వారు ఈ దాడులకు దిగారు. ఎసిబి అధికారుల దాడిలో ఖలీముల్లా 3 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు బయట పడింది.

ఖలీముల్లా వద్ద 40 లక్షల రూపాయల నగదు, 50 తులాల బంగారం పట్టుబడ్డాయి. అలాగే 50 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే కాంప్లెక్స్, రెండు ఇళ్లు కూడా ఉన్నట్లు తేలింది. ప్లాట్లు కూడా ఉన్నట్లు తేలింది. బ్యాంక్ లాకర్లను అధికారులు పరిశీలించాల్సి ఉంది. ఆస్తులన్నీ తన బంధువులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించారని, తాను సంపాదించిందేమీ లేదని ఖలీముల్లా అంటున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X