వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాకు సిద్ధపడిన చిదంబరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: దంతెవాడ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను ఆయన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు సమర్పించారు. చత్తీస్ గడ్ లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల దాడిలో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటనకు పూర్తి తనదేనని ఆయన చెప్పారు. దంతెవాడ నుంచి వచ్చిన వెంటనే తాను ప్రధానిని కలిశానని, ఓ లేఖను అందజేశానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆ లేఖలోని వివరాలను చెప్పడానికి ఆయన నిరాకరించారు.

దంతెవాడ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ ఆయన తన రాజీనామా లేఖను ప్రధానికి అందజేసినట్లు వార్తలు వస్తున్నాయి. చిదంబరం లేఖ అందిన మాట వాస్తవమేనని ప్రధాని కార్యాలయం వర్గాలు చెప్పాయి. అయితే లేఖలోని వివరాలను వెల్లడించడానికి నిరాకరించాయి. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా చిదంబరం మరో లేఖ రాసినట్లు సమాచారం. నిఘా వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం వల్ల, సిఆర్పీఎఫ్ జవాన్లకు సరైన శిక్షణ లేదని వచ్చిన విమర్శల వల్ల దంతెవాడ ఘటన చోటు చేసుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చిదంబరం రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. అయితే చిదంబరం రాజీనామాను ప్రధాని తిరస్కరించినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X