వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో శ్రీవారి కల్యాణాలకు ఒబామా

By Santaram
|
Google Oneindia TeluguNews

TTD
తిరుమల: అమెరికాలో మే ఒకటి, తొమ్మిదో తేదీల్లో తిరుమల శ్రీనివాస కల్యాణాలను నిర్వహిస్తున్నట్లు టీటీడీ బోర్డు చైర్మన్ ఆదికేశవులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలోని ప్రచురణలను ఒబామాకు అందజేస్తామని తెలిపారు. తిరుమలలో ఆదికేశవులు విలేఖరులతో మాట్లాడారు.

2008-09 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకుంటున్న పరిస్థితుల్లో లోకకల్యాణార్థం శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలని ప్రవాస భారతీయలు కోరారన్నారు. వారి కోరిక మేరకు మే 1న న్యూజెర్సీలోని గురువాయురప్పన్ ఆలయంలో, 9న కాలిఫోర్నియాలోని సన్నివేల్ ఆలయంలో కల్యాణోత్సవాలను నిర్వహిస్తామన్నారు.

ఈ ఆలయాల ట్రస్టుబోర్డులు, తెలుగుటైమ్స్ సంస్థ సంయుక్త నిర్వహణలో 40 మందితో కూడిన కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఆయా ఆలయాలకు చేరుకున్న ఉత్సవమూర్తులకు నిత్యపూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారన్నారు. అన్నమయ్య సంకీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఎస్వీ భక్తి చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X