వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బందరు పోర్టు పనులు మేలో మొదలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Machilipatnam
మచిలీపట్నం: కృష్ణాజిల్లా వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బందరు పోర్టు అభివృద్ధి పనులను మే నెలలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మచిలీపట్నం వాసులు తమ చిరకాల వాంఛగా ఉన్న బందరు పోర్టు గోగిలేరుకు తరలిపోకుండా పోరాటాలు చేసి కాపాడుకున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని బందరు పోర్టును మచిలీపట్నంలోనే నిర్మించేందుకు శంకుస్థాపన చేశారన్నారు.

పోర్టు పనులను దక్కించుకున్న మేటాస్‌ సంస్థ ఆర్థికపరమైన చిక్కుల్లో పడటంతో ఈ పనులను అన్ని జాగ్రత్తలూ తీసుకుని నవయుగ కన్సార్టియానికి అప్పగించినట్లు చెప్పారు. ఈ సంస్థ కృష్ణపట్నం పోర్టు నిర్మాణాన్ని 17 నెలల్లోనే పూర్తి చేసిందన్నారు. బందరు పోర్టు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలని ఒప్పందం జరిగినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.350 కోట్లు మూడు విడతలుగా అందిస్తామన్నారు. పోర్టుకు కేటాయించిన ఆరువేల ఎకరాల భూమి అప్పగించే విషయంపై ఇప్పటికే కలెక్టర్‌తో మాట్లాడానన్నారు. సాధ్యమైనంత త్వరలో భూమిని అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X