హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహీంద్ర సత్యం ఐటి సెజ్ సిద్ధం

By Santaram
|
Google Oneindia TeluguNews

Mahindra Satyam
హైదరాబాద్‌: సత్యం కంప్యూటర్స్ నుంచి టేకోవర్ చేసిన మహీంద్ర సత్యం ఆర్ధిక పరిస్ధితి బాగుపడుతున్నట్టు సూచనలు అందుతున్నాయి. మహీంద్ర సత్యం తరపున కొత్తగా ఐటీ సెజ్‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర మైనార్టీ, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ తెలిపారు. మంగళవారం మహీంద్ర సత్యం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మేటాస్‌ వ్యవహారాన్ని నిరంతరంగా పర్యవేక్షిస్తున్నట్లు ఖుర్షీద్‌ పేర్కొన్నారు. కాగా మహీంద్ర సత్యం దాదాపు 100 శాతం క్లయింట్‌లను తిరిగి సాధించుకోగలిగిందని మహీంద్ర సత్యం ఛెర్మన్‌ వినీత్‌ నాయర్‌ తెలిపారు.

ఇలా ఉండగా సత్యం రామలింగరాజు ఆరోగ్యం బాగా క్షీణించి ఆందోళన కలిగిస్తోంది. గత కొన్నాళ్లుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న రిమాండ్‌ ఖైదీ సత్యం మాజీ అధినేత రామలింగరాజు ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఆయన హెపటైటిస్‌-సి వ్యాధితో బాధపడుతున్నారని, కాలేయం దెబ్బతినడంతో పాటు గుండె జబ్బు కూడా ఉందని వైద్యులు గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన శరీరంలో తెల్ల రక్తకణాల సంఖ్య 1800కు పడిపోయినట్లు పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X