హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చేవెళ్ల నుంచే రోశయ్య ప్రజాపథం

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ మాదిరే ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య చేవెళ్ల సెంటిమెంటును అనుసరించబోతున్నారు. ఈ నెల 19న చేవెళ్లలో ప్రజాపథంకార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా రోశయ్య ప్రజాపథంలో పాల్గొనబోతున్నారు. ముందుగా అనంతపురం నుంచి దీన్ని ప్రారంభించాలని భావించినా, చేవెళ్ల సెంటిమెంట్‌ను పరిగణనలోనికి తీసుకొని అటు వైపు మొగ్గుచూపారు.

ఈ నెలలో విస్తృత పర్యటనలు: 14న ఉదయం మహబూబ్‌ నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో భూ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రోశయ్య పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరుతారు. సోనియాగాంధీతో భేటీ అవుతారు. 15న ప్రణాళిక సంఘం సమావేశంలో పాల్గొంటారు. 24, 25 తేదీల్లో అనంతపురం, 30న నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు. రోశయ్య అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల 22న జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X