తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు కాంగ్రెసులోకి వస్తారు: ఆదికేశవులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి: "నేను చెబుతున్నాను. కావాలంటే రాసుకోండి. చిరంజీవి కాంగ్రెసు పార్టీలోకి రావడం ఖాయం" అని అధ్యక్షుడు డి.కె.ఆదికేశవులు నాయుడు అన్నారు. మంగళవారం తిరుమలలో ఆయన విలేఖరులతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి, కాంగ్రెసు నేత చెంగారెడ్డి కూడా చిరంజీవిని కాంగ్రెసు‌లోకి ఆహ్వానించారు. ఆయన తమ పార్టీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చిరు సమక్షంలోనే తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను, ఆహ్వానాలను చిరంజీవి కొట్టిపడేశారు.

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసు‌లో విలీనమయ్యే ప్రసక్తే లేదనిస వారు అభిమానంతో పిలిచినంత మాత్రాన తాము వెళ్లిపోతామని అనుకోవడం పొరపాటని స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. తమ వాళ్లు కష్టపడుతున్నారని, ప్రజల కోసం ఎంతో చేస్తున్నామని, అయితే, తమ పార్టీకి మార్కెటింగ్ చేసుకోవడం తెలియదని చిరంజీవి అన్నారు. చేసిన అభివృద్ధిపనులు చెప్పుకొని మార్కెటింగ్ చేసుకోవడంలో ఇకపై తామూ ముందుంటామన్నారు. సమైక్యవాదంపై కాంగ్రెసు, టీడీపీలకు స్పష్టత లేదని ఆయన విమర్శించారు.

చంద్రబాబు ఆహ్వానిస్తే ధరలపై అన్ని పార్టీలతో కలిసి చేస్తున్న ఉద్యమంలో పాల్గొంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిత్తూరు జిల్లాలో నష్టపోయిన మామిడి రైతులకు ఎకరాకు రూ.20వేలు వంతున పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X