చిరు కాంగ్రెసులోకి వస్తారు: ఆదికేశవులు
ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమయ్యే ప్రసక్తే లేదనిస వారు అభిమానంతో పిలిచినంత మాత్రాన తాము వెళ్లిపోతామని అనుకోవడం పొరపాటని స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. తమ వాళ్లు కష్టపడుతున్నారని, ప్రజల కోసం ఎంతో చేస్తున్నామని, అయితే, తమ పార్టీకి మార్కెటింగ్ చేసుకోవడం తెలియదని చిరంజీవి అన్నారు. చేసిన అభివృద్ధిపనులు చెప్పుకొని మార్కెటింగ్ చేసుకోవడంలో ఇకపై తామూ ముందుంటామన్నారు. సమైక్యవాదంపై కాంగ్రెసు, టీడీపీలకు స్పష్టత లేదని ఆయన విమర్శించారు.
చంద్రబాబు ఆహ్వానిస్తే ధరలపై అన్ని పార్టీలతో కలిసి చేస్తున్న ఉద్యమంలో పాల్గొంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిత్తూరు జిల్లాలో నష్టపోయిన మామిడి రైతులకు ఎకరాకు రూ.20వేలు వంతున పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
చిరంజీవి ప్రజారాజ్యం తిరుపతి ఆదికేశవులు నాయుడు టిటిడి తిరుమల chiranjeevi prajarajyam adikesavulu naidu ttd tirumala tirupati
Story first published: Wednesday, April 14, 2010, 8:14 [IST]