వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు టిడిపి ఎంపీలకు స్పీకర్ షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
న్యూఢిల్లీ: ముగ్గురు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులకు లోకసభ స్పీకర్ మీరా కుమార్ షాక్ ఇచ్చారు. ఆదాయ వివరాలు అందించనందుకు వారికి ఆమె నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీననే ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం లోకసభ సభ్యులు రమేష్ రాథోడ్, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్ లకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.

లోకసభకు ఎన్నికైన తర్వాత 90 రోజులలోగా సభ్యులు తమ తమ ఆదాయ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది గడువులోగా అందించకపోవడంతో ఆ గడువును ఆరు నెలలకు పెంచారు. అయినా కొంత మంది అందించలేదు. దీంతో ముగ్గురు తెలుగుదేశం సభ్యులతో పాటు ఇతర పార్టీలకు చెందిన సభ్యులకు కూడా మీరా కుమార్ నోటీసులు జారీ చేశారు. ఆదాయ వివరాలు అందించకపోతే సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని ఆమె హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X