జమున కూతురికి కట్నం వేధింపులు
స్రవంతి ఫిర్యాదు ప్రకారం - ఆడపడుచు కట్నం కింద జమున కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు ఇచ్చారు. అయితే వారు పది లక్షల రూపాయలు కావాలని పట్టుబట్టారు. చివరకు 4 లక్షల 75 వేల రూపాయలు ఇచ్చారు. అయితే దాంతో సంతృప్తి చెందకుండా కారు కావాలంటూ డిమాండ్ చేశారు. ఇలా గొంతెమ్మ కోరికలు కోరుతూనే ఉన్నారు. చివరకు జమున ఉంటున్న బంజారాహిల్స్ లోని ఇంటిని రాసివ్వాలంటూ వేధించడం మొదలు పెట్టారు. దాంతో కుమారుడు అవిష్ ను తీసుకుని స్రవంతి పుట్టింటికి వచ్చేసింది. నిరుడు ఆగస్టులో విడాకుల కోసం కోర్టులో పిటిషన్ కూడా వేసింది. అయినా వేధింపులు ఆగకపోవడంతో సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Story first published: Friday, April 16, 2010, 8:40 [IST]