గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బస్సు దూసుకెళ్లి ఐదుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Guntur
గుంటూరు: గుంటూరు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన నడుస్తున్న కూలీలపైకి ఆర్టీసి బస్సు దూసుకెళ్లడంతో ఐదుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడిన వారిని అస్పత్రికి తరలించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామంలో జరిగింది.

పనుల నుంచి మధ్యాహ్న భోజనానికి వెళ్తున్న కూలీలపైకి అదుపు తప్పి ఆర్టీసి బస్సు దూసుకెళ్లింది. దీంతో ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X