గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రేక్ ఇన్ స్పెక్టర్ అక్రమాస్తులు కోటి పైనే

By Pratap
|
Google Oneindia TeluguNews

Guntur
గుంటూరు: గుంటూరులోని బ్రేక్ ఇన్ స్పెక్టర్ రామారావు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి అస్తులున్నాయనే ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు ఈ దాడులు నిర్వహించారు. గుంటూరు, చీరాలల్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోటి రూపాయలకు పైగా రామారావు అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు బయట పడింది.

విజయవాడలో కూడా రామారావుకు ఇల్లు ఉన్నట్లు తేలింది. కొలకలూరు గ్రామంలో వ్యవసాయ భూమి ఉన్నట్లు బయట పడింది. పెద్ద యెత్తున బంగారం నగలు, సెల్ ఫోన్లు ఎసిబి సోదాలాల్లో బయట పడ్డాయి. రామారావుపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నెల రోజుల పాటు రామారావు ఆస్తులపై దృష్టి పెట్టి ఎసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X