వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్ కు ఆయుధాలిస్తున్న ముఠా అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
సంగారెడ్డి: మావోయిస్టులతో సహా వివిధ నక్సలైట్ గ్రూపులకు ఆయుధాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మెదక్ జిల్లా పోలీసులు ర్టటు చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాదుకు ఆయుధాలు తరలిస్తున్న వాహనాన్ని సంగారెడ్డి మండలం జుక్కల్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ప్రజాప్రతిఘటన గెరిల్లా దళానికి చెందిన మోహనన్న బృందానికి ఆ ఆయుధాలను తెస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆయుధ వ్యాపారి సునీల్ కుమార్ తోపాటు మాజీ నక్సలైట్ దేవేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సునీలో తో మోహనన్న బృందానికి దేవేందర్ ఒప్పందం కుదిర్చినట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి పోలీసులు ఒక ఎకె 47, స్ప్రీంగ్ ఫీల్డ్ రైఫిల్, దేశవాళి పిస్టల్, 676 తూటాలు, 12 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి కండీషన్ లోనే ఉన్నాయని మెదక్ ఎస్పీ సజ్జనార్ చెప్పారు.

ఇదిలా వుంటే, ఖమ్మం జిల్లా గుండాల అటవీ ప్రాంతంలో ప్రజా ప్రతిఘటనకు చెందిన దళ కమాండర్ మోహనన్న మీద దళ సభ్యుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీని నుంచి మోహనన్న తప్పించుకున్నట్లు చెబుతున్నారు. కాల్పులు జరిపిన దళ సభ్యుడు పరారైనట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X