వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థరూర్ ఉద్వాసన విపక్షాల జయం: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి శశి థరూర్ రాజీనామా ప్రతిపక్షాల విజయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ధరల పెరుగుదలపై చేపట్టే ఆందోళన కార్యక్రమాలపై సోమవారం వామపక్షాల నేతలతో చర్చించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వంలోని పెద్దలు డబ్బులు దండుకోవడమే కార్యక్రమంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ఐపియల్ కొచ్చి ఫ్రాంచైజీలో శశి థరూర్ పాత్రను ఆయన ఎత్తి చూపారు. ధరల పెరుగుదలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన చెప్పారు.

ప్రతిపక్షాలు జాతీయ స్థాయిలో ఆందోళనలకు శ్రీకారం చుట్టినా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులపై సర్వీసు టాక్స్ ను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ లపై మన రాష్ట్రంలోనే పన్ను అధికంగా ఉందని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన అన్నారు. తెల్ల రేషన్ కార్డులను ప్రభుత్వం ఏరేస్తోందని, సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయడం లేదని ఆయన విమర్శించారు. ధరలను తగ్గించే విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించడం లేదని ఆయన అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తదితరులు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X