వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాలమూరు జిల్లాలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు
మహిళలు, రైతులు, సామాజిక వర్గాల కార్యకర్తల నుంచి వారు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సోమవారం మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకున్నారు. వారు సోమవారం రాత్రి మహబూబ్ నగర్ లో బస చేసి మర్నాడు మంగళవారం కర్నూలు జిల్లాకు చేరుకుంటారు. ఆకుతోట పల్లిలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు కాంగ్రెసు కార్యకర్తలతోనే కూర్చుని అభిప్రాయాలు సేకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కమిటీ సభ్యులు వస్తున్నట్లు తమకు సమాచారం కూడా లేదని వారంటున్నారు.
Comments
Story first published: Monday, April 19, 2010, 10:11 [IST]