వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలమూరు జిల్లాలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ravindar Kaur
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు రవీందర్ కౌర్, అబూ సలే షరీఫ్ సోమవారం పర్యటిస్తున్నారు. వారు పాలమూరు జిల్లాకు ఇప్పటికే చేరుకున్నారు. ఆమనగల్లు, మాడ్గుల, కల్వకుర్తి తదితర మండలాల్లోని గ్రామాల్లో వారు క్షేత్రపర్యటన సాగిస్తున్నారు. కడ్తాల్ మండలం ఆకుతోట పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో వారు మహిళల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ అభిప్రాయ సేకరణ బహిరంగంగా చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కార్యాలయం ముందు వారు ధర్నాకు దిగారు.

మహిళలు, రైతులు, సామాజిక వర్గాల కార్యకర్తల నుంచి వారు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సోమవారం మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకున్నారు. వారు సోమవారం రాత్రి మహబూబ్ నగర్ లో బస చేసి మర్నాడు మంగళవారం కర్నూలు జిల్లాకు చేరుకుంటారు. ఆకుతోట పల్లిలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు కాంగ్రెసు కార్యకర్తలతోనే కూర్చుని అభిప్రాయాలు సేకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కమిటీ సభ్యులు వస్తున్నట్లు తమకు సమాచారం కూడా లేదని వారంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X