ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రం విడిపోతే ప్రాణాలు పోవు: గోరటి వెంకన్న

By Santaram
|
Google Oneindia TeluguNews

Gorati Venkanna
ఒంగోలు: రాష్ట్ర విభజన పట్ల ప్రజల్లో పంచాయతీ లేదని ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పేర్కొన్నారు. బహుజన కెరటాలు ఆధ్వర్యంలో 'ప్రత్యేకాంధ్రలో బహుజనుల రాజ్యం' అనే అంశంపై స్థానిక హెచ్‌సీఎం కాలేజ్‌ గ్రౌండ్‌ లో ఆదివారం రాత్రి అంబేద్కర్‌ మేళా నిర్వహించారు. తొలుత కారంచేడు దళిత ఉద్యమ కార్యకర్త సిర్రా సులోచన డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, డప్పు కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బహుజన కెరటాలు ప్రత్యేక సంచికను వెంకన్న ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే ప్రాణాలు పోతాయా? అంటూ పాట ద్వారా ప్రశ్నించారు. బతుకుదెరువుకు వచ్చిన ఆంధ్ర కూలీలకు తాము రక్షణ కవచాలుగా నిలుస్తామని చెప్పారు. సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో దోపిడీలు జరుగుతున్నాయని అన్నారు. ఈ యుగం వైతాళికుడు అంబేద్కర్‌ అంటూ, కులాలు కూలిపోవాలని ఆలపించారు. ఈ సందర్భంగా వెంకన్న ప్రత్యేక తెలంగాణకు మద్ధతుగా పలు పాటలు పాడి చిందేశారు. అదే విధంగా 'ఏమి మారే..ఏమీ మారెరా ఈ పేదల బతుకులు' అంటూ జిల్లాలోని కనిగిరి, దోర్నాల ప్రాంతాల్లో ఆయన పర్యటించానని చెబుతూ అక్కడి వెనుకబాటుతనంపై పాట ద్వారా వివరించారు. బహుజన కెరటాలు రాష్ట్ర కో-కన్వీనర్‌, సభాధ్యక్షుడు పల్నాటి శ్రీరాములు మాట్లాడుతూ అంబేద్కర్‌ చిన్నరాష్ట్రాలను కోరుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలని కోరుతూ గోరటి వెంకన్నకు గులాబీ పూలతో వినతిపత్రం అందజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X