రాష్ట్రం విడిపోతే ప్రాణాలు పోవు: గోరటి వెంకన్న
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే ప్రాణాలు పోతాయా? అంటూ పాట ద్వారా ప్రశ్నించారు. బతుకుదెరువుకు వచ్చిన ఆంధ్ర కూలీలకు తాము రక్షణ కవచాలుగా నిలుస్తామని చెప్పారు. సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో దోపిడీలు జరుగుతున్నాయని అన్నారు. ఈ యుగం వైతాళికుడు అంబేద్కర్ అంటూ, కులాలు కూలిపోవాలని ఆలపించారు. ఈ సందర్భంగా వెంకన్న ప్రత్యేక తెలంగాణకు మద్ధతుగా పలు పాటలు పాడి చిందేశారు. అదే విధంగా 'ఏమి మారే..ఏమీ మారెరా ఈ పేదల బతుకులు' అంటూ జిల్లాలోని కనిగిరి, దోర్నాల ప్రాంతాల్లో ఆయన పర్యటించానని చెబుతూ అక్కడి వెనుకబాటుతనంపై పాట ద్వారా వివరించారు. బహుజన కెరటాలు రాష్ట్ర కో-కన్వీనర్, సభాధ్యక్షుడు పల్నాటి శ్రీరాములు మాట్లాడుతూ అంబేద్కర్ చిన్నరాష్ట్రాలను కోరుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలని కోరుతూ గోరటి వెంకన్నకు గులాబీ పూలతో వినతిపత్రం అందజేశారు.