నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజాపథానికి తెరాస కార్యకర్తల ఆటంకం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Talli
హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపథం కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు తెలంగాణలో అడ్డుకుంటున్నారు. ప్రజాపథాన్ని అడ్డుకోవాలని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజాపథం పేరుతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవాడనికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రజాపథాన్ని సాకుగా చూపి తెలంగాణలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెరాస విమర్శిస్తోంది.

సోమవారం ఉదయం మెదక్ జిల్లా పటాన్ చెరు మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో తెరాస కార్యకర్తలు ప్రజాపథం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కాంగ్రెసు శాసనసభ్యుడు నందీశ్వర్ గౌడ్ ను, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని తెరాస కార్యకర్తలు ఘెరావ్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అలాగే నిజామాబాద్ జిల్లాలోనూ తెరాస కార్యకర్తలు ప్రజాపథం కార్యక్రమాలను అడ్డుకున్నారు. ప్రజాపథం కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే తెరాస నిర్ణయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పు పట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X