హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రవీందర్ కౌర్ పై తెలంగాణవాదుల ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ravindar Kaur
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ సభ్యురాలు రవీందర్ కౌర్ పై తెలంగాణవాదులు కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ కు, నోడల్ అధికారి రాజీవ్ శర్మకు ఫిర్యాదు చేశారు. ఆమె శ్రీనివాస్ అనే విజయవాడకు చెందిన వ్యక్తిని అనువాదకుడిగా పెట్టుకోవడంపై వారు ఈ ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ కేవలం అనువాదకుడిగానే వ్యవహరించకుండా నానా హంగామా చేస్తున్నాడని, తెలంగాణ ప్రజల అభిప్రాయాలను వక్రీకరించే ప్రమాదం ఉందని తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వారు ఈ ఫిర్యాదు చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని వికె దుగ్గల్ తెలంగాణవాదులకు హామీ ఇచ్చారు.

సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యులు రవీందర్ కౌర్, అబు సలే షరీఫ్ మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. వారు వెల్దుర్తి మండలంలో ఓ గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. వివిధ సామాజిక వర్గాలకు, వృత్తులకు చెందిన వ్యక్తులతో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే కలిగే లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అనే విషయాలపై వారు ప్రజల నుంచి అభిప్రాయాలు కోరారు. తమ పర్యటన సంతృప్తికరంగా ఉందని రవీందర్ కౌర్ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X