జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్ జిల్లాలో మహిళపై దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Karimnagar Dist
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో ఓ మహిళపై బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో పద్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలంలోకి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన దుండగులు పారిపోయారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

పద్మ అనే మహిళ తన కూతురు పవిత్రతో కలిసి జగిత్యాలలోని అరవింద్ నగర్ కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటోంది. ఆమె భర్త దుబాయ్ లో ఉంటున్నాడు. అతనికి ఈమె రెండో భార్య. ఆ వ్యక్తికి సంబంధించిన మొదటి భార్యతో పద్మకు గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గొడవలే పద్మపై దాడికి కారణమని అనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X