విజయవాడ కొత్త సిపి దడపుట్టిస్తారా?
సురేంద్రబాబు కమిషనర్గా నగరంలోని అసాంఘికశక్తులను అణచివేసిన సమయంలో సీతారామాంజినేయులు గుంటూరు జిల్లాలో పనిచేశారు. 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన ఖమ్మం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత సుదీర్ఘకాలం ఇంటిలిజెన్స్ డీఐజీగా పనిచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ మరణించిన తర్వాత జాయింట్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకారులకు ముకుతాడు వేసి వార్తల్లోకెక్కారు.
Comments
విజయవాడ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ సీతారామాంజనేయులు vijayawada osmania university telangana crimes
Story first published: Wednesday, April 21, 2010, 8:15 [IST]