విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడ కొత్త సిపి దడపుట్టిస్తారా?

By Santaram
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: నగర పోలీసు కమిషనర్ గా రాజేంద్రనాథ్‌ రెడ్డి స్థానంలో పి.సీతారామాంజనేయులు నియమితులయ్యారు. హైదరాబాద్‌ లో జాయింట్‌ పోలీసు కమిషనర్‌(కో-ఆర్డినేషన్‌ అండ్‌ సెక్యూరిటీ)గా పనిచేస్తున్నారు. ఆయన పేరు వినగానే స్ధానిక పోలీసు అధికారుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నట్లు సమాచారం. దూకుడుగా వెళుతూ అసాంఘికశక్తులను అణిచివేయడంతో పాటు యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తారని ఆయనకు పేరుంది. విజయవాడ వంటి నగరాల్లో నేరాలు అధికం. సీతారామాంజనేయులు ఈ నగరానికి సరిగ్గా సరిపోతారు.

సురేంద్రబాబు కమిషనర్‌గా నగరంలోని అసాంఘికశక్తులను అణచివేసిన సమయంలో సీతారామాంజినేయులు గుంటూరు జిల్లాలో పనిచేశారు. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌ కు చెందిన ఆయన ఖమ్మం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత సుదీర్ఘకాలం ఇంటిలిజెన్స్‌ డీఐజీగా పనిచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ మరణించిన తర్వాత జాయింట్‌ కమిషనర్‌ గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకారులకు ముకుతాడు వేసి వార్తల్లోకెక్కారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X