వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమల, షిరిడీ పూజలు మొబైల్ లో

By Santaram
|
Google Oneindia TeluguNews

Shirdi Saibaba
న్యూఢిల్లీ: పుణ్య క్షేత్రాల్లోని పూజలు, హారతులు ఇక మొబైల్ లైవ్ ‌లో వినొచ్చు. ఇందుకోసం భారతీ ఎయిర్‌టెల్‌ 'లైవ్‌ హారతి' పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా తమ వినియోగదారులు తిరుపతి వెంకన్న, సిద్ధి వినాయకుడు, షిర్డీ సాయిబాబా, బంగ్లా సాహిబ్‌ పుణ్యక్షేత్రాల్లో జరిగే పూజలను లైవ్‌లో తమ మొబైళ్లలో వినొచ్చని కంపెనీ పేర్కొంది. సభ్యత్వ రుసుము రూ.5(ఒకే సారి మాత్రమే)చెల్లించి రోజువారీ సబ్‌ స్క్రిప్షన్‌ ఫీజు రూ.2 (ఒక్కో పుణ్యక్షేత్రానికి)తో ఈ సేవలను పొందవచ్చని తెలిపింది.

భక్తిరస భావాలను టెక్నాలజీ ద్వారా ఎంత దూరం ఉన్నా పొందడానికి చేసిన ఈ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా భక్తులు లైవ్‌లో హారతి కార్యక్రమాలను వినొచ్చని కంపెనీ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ - మొబైల్‌ సర్వీసెస్‌) శిరీష్‌ జోషి తెలిపారు. త్వరలో ఈ సేవల్లోకి గోల్డెన్‌ టెంపుల్‌, వైష్ణో దేవి, కాశీ విశ్వనాథ్‌, పూరి జగన్నాథ్‌, పాట్నా సాహిబ్‌ గురుద్వారా వంటి క్షేత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ చెబుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X