హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ మోసం చేస్తున్నారు: కోటగిరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kotagiri Vidyadhara Rao
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధరరావు విమర్శించారు. ప్రజలను తెరాస తప్పు దోవ పట్టిస్తోందని, ప్రజలను రెచ్చగొడుతోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.

తాము సమర్పించిన నివేదికపై శ్రీకృష్ణ కమిటీ వివరణ అడుగుతోందని, తాము వివరణలు ఇస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలోని ప్రభుత్వాలు ఎక్కువ నిధులు ఖర్చు చేశాయని ఆయన అన్నారు. వెనకబడిన ప్రాంతమనే మాటను మార్చి ఆత్మగౌరవమని తెరాస ఇప్పుడు అంటోందని ఆయన అన్నారు.

గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును డిజైన్ మార్పు పేరుతో మూలన పడేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ప్రజారాజ్యం పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆపాలని ప్రయత్నిస్తే తాము పెద్ద యెత్తున ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X