వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి సారధి పై 60 కోట్ల భూ కబ్జా ఆరోపణ

By Santaram
|
Google Oneindia TeluguNews

Krishna Dist
కంకిపాడు: కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొలుసు పార్ధసారథి హైదరాబాద్‌ ప్రగతినగర్‌లో 20 ఎకరాల ఎసైన్డు భూమిని అక్రమించారని తెలుగుదేశం పార్టీ పెనమలూరు నియోజకవర్గ బాధ్యుడు చలసాని పండు ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మంత్రి సారథిపై పలు ఆరోపణలు చేశారు. వీటిని తాను నిరూపిస్తానని ఆయన సవాల్‌ విసిరారు. ఆ ఎస్సైన్డు భూమి ఎకరం రూ.3 కోట్లు విలువ చేస్తుందని పేర్కొన్నారు.

మంత్రి పదవిని అడ్డంపెట్టుకొని దాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తమిరిశ గ్రామంలోని 25 ఎకరాల దేవాలయ భూమిని రూ.10 వేల లీజుకే పొందడానికి ఆ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఈ భూమికి పక్కనే ఉన్న పొలాలకు రూ.29,500 లీజు చెల్లింపునకుగాను అగ్రిమెంటు చేశారని తెలిపారు. ఈ ఆరోపణలను కూడా తాను నిరూపిస్తానని పండు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X