విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో అదృశ్యమై విశాఖలో తేలి...

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
విశాఖపట్నం: హైదరాబాదులోని అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు విశాఖపట్నంలో తేలారు. హైదారాబాదులోని రాజేంద్రనగర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న పూజిత, ఆకాష్ దూబే అనే ఇద్దరు విద్యార్థులు బుధవారం సాయంత్రం అదృశ్యమయ్యారు. పరీక్ష రాసిన తర్వాత వారిద్దరు కనిపించకుండా పోయారు. దీంతో పూజిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాదులోని రాజేంద్ర నగర్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. దీంతో రైల్వే పోలీసులు వారిని విశాఖపట్నంలో గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిద్దరు విశాఖపట్నం రైల్వే పోలీసుల రక్షణలో ఉన్నారు. వారు ఎందుకు విశాఖపట్నం వెళ్లింది, తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X