హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: వారం రోజుల క్రితం హైదరాబాదులోని అదృశ్యమైన వ్యక్తి నల్లగొండలో శవమై తేలాడు. ఈ నెల 15వ తేదీన అదృశ్యమైన నరసింహారెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి శవం నల్లగొండలోని రైల్వే ట్రాక్ పక్కన కనిపించింది. హైదరాబాదులోని ఛత్రినాకకు చెందిన నరసింహారెడ్డి ఈ నెల 15వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి కనిపించడం లేదు. ఈ విషయంపై ఆయన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నరసింహారెడ్డిని బాగా తెలిసిన వారే కిడ్నాప్ చేసి హత్య చేశారని అనుమానిస్తున్నారు. ఆయన కిడ్నాపైన తర్వాత అతని వద్ద 50 లక్షల రూపాయలు మాయమైనట్లు తెలుస్తోంది. భూవివాదమే నరసింహారెడ్డి హత్యకు కారణమని భావిస్తున్నారు. నరసింహారెడ్డి సెల్ ఫోన్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X