హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ రాయబారం: సిపిఎం సమైక్యవాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ ముందు సిపిఎం నాయకులు శుక్రవారం సమైక్యవాదాన్ని వినిపించారు. సిపిఎం ప్రతినిధులు లేక్ వ్యూ అతిథి గృహంలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులను కలిశారు. పార్టీ తరఫున మరో అనుబంధ నివేదికను అందజేసింది. తెలంగాణ సాహ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో మంచినీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని సిపిఎం సూచించింది.

తెలంగాణ, రాయలసీమల్లో సమగ్ర భూపంపిణీ జరగాలని తన వాదనలు తెలిపింది. రాష్ట్రంలోని సామాజిక పరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సిపిఎం ప్రతినిధులను వివరణ కోరింది. తెలంగాణ విషయంలో గతంలో జరిగిన ఒప్పందాలన్ని రాజకీయంగా జరిగాయని కమిటీ తెలిపిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తెలిపారు. భవిష్యత్తులో జరిగే ఒప్పందాలన్నింటికీ చట్టబద్దత కల్పించాలని తాము కోరామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X