వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానందకు 4 రోజుల పోలీసు కస్టడీ

By Santaram
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
బెంగళూరు: రాసలీలల ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామీజీ నిత్యానందను విచారించేందుకు పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారు. ధ్యానపీఠం వ్యవస్థాపకుడు నిత్యానంద పరమహంస అలియాస్‌ రాజశేఖరన్‌ (34)కు న్యాయమూర్తి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించారు. పోలీసులు వెంటనే ఆయన్ను రహస్య ప్రదేశానికి తరలించారు. గురువారం సాయంత్రం నిత్యానందను, అనుచరుడు గోపాల శీలం రెడ్డిలను సిఓడి పోలీసులు బెంగళూరుకు తీసుకువచ్చారు. సిమ్లాలో కోర్టు ముందు హాజరు పరచిన తరువాత చండీఘడ్‌కు అక్కడి నుంచి ముంబయి మీదుగా తీసుకొచ్చారు.

బెంగళూరు విమానాశ్రయం నుంచి భారీ బందోబస్తుతో రామనగర్‌కు తరలించారు. అక్కడి ప్రభుత్వాసుపత్రిలో నిత్యానందకు గురువారం రాత్రి తొమ్మిది గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి పదిగంటల తర్వాత రామనగర జిల్లా కోర్టు ముఖ్య న్యాయమూర్తి పుష్పావతి ఇంట్లో హాజరు పరిచారు. దాదాపు 20నిమిషాల పాటు విచారించిన న్యాయమూర్తి పోలీసుల విన్నపం మేరకు నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఆదేశించారు. భారీ బందోబస్తు మధ్య జడ్జి ఇంటి నుంచి బయటకు వచ్చిన నిత్యానంద పోలీసు కారు ఎక్కే సమయంలో ఓ యువకుడు దాడి చేశాడు. అంతకు మునుపు బెంగళూరు విమానాశ్రయం వద్ద కూడా ఓ దుండగుడు నిత్యానంద భుజంపై కొట్టాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X