హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెంటిమెంట్లకు కారణాలనేకం: శ్రీకృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikrishna
హైదరాబాద్: సామాజిక, ఆర్థిక, చారిత్రక నేపథ్యంలోనే ప్రజల్లో సెంట్ మెంట్ పుట్టుకుని వస్తుందని రాష్ట్ర పరిస్థితిపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీకి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ శ్రీకృష్ణ అన్నారు. క్షేత్రస్థాయిలో జరిగే పర్యటనల్లో తాను కూడా పాల్గొంటానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. రాజకీయ పార్టీలతో జరిపిన సంప్రదింపుల ప్రక్రియలో విలువైన సమాచారం లభించిందని ఆయన అన్నారు.

ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎంలతో జరిపిన సంప్రదింపుల ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనను ముగించుకుని శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు గురు, శుక్రవారాల్లో ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X