నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజాపథంలో ఘర్షణలు, అపశృతులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Andhr Pradesh Map
హైదరాబాద్: రాష్ట్రంలో పలు చోట్ల శనివారం ప్రజాపథంలో అపశృతులు చోటు చేసుకున్నాయి, ఘర్షణలు జరిగాయి. వరంగల్ జిల్లా సలాక్ పుర, మరమాముల గ్రామాల్లో ఘర్షణలు చెలరేగాయి. ఈ గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సలాకపురం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. విధ్వంసం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా నేరేడు చెర్లలో తెలుగుదేశం, కాంగ్రెసు కార్యకర్తల మధ్య ఘర్ణణ చెలరేగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు లాఠీ చార్జీ చేశారు.

నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్ణణ చోటు చేసుకుంది. శాసనసభ్యుడు గంప గోవర్దన్ కారును ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ప్రజాపథంలో ఓ రైతు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X