వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంసిఐ అధ్యక్షుడు కేతన్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ketan Parekh
న్యూఢిల్లీ: భారీ మొత్తంలో లంచం తీసుకుంటున్నారన్న ఆరోపణలపై భారత వైద్య మండలి (ఎంసీఐ) అధ్యక్షుడు కేతన్‌ దేశాయ్‌ను సిబిఐ అరెస్టు చేసింది. పంజాబ్‌లోని ఓ వైద్య కళాశాలలో ప్రవేశాలకు అనుమతి ఇచ్చేందుకు రూ.2కోట్లు లంచం అడిగిన దేశాయ్‌, మరో ముగ్గురు వ్యక్తులు గురువారం రాత్రి సీబీఐకి పట్టుబడ్డారు. సదరు కాలేజీకి మౌలికసదుపాయాలు లేవని తనిఖీ బృందం అభ్యంతరాలు చెప్పినా, 2010-11లో ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని దేశాయ్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లంచాల బాగోతం నడిచింది. దేశాయ్‌ కాకుండా సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురిలో జితేందర్‌పాల్‌ సింగ్‌ (మధ్యవర్తి), జ్ఞాన్‌సాగర్‌ ప్రైవేటు మెడికల్‌ కాలేజీ(పాటియాలా) ప్రొఫెసర్‌ కన్వల్‌జిత్‌సింగ్‌, కాలేజీ వైస్‌ఛైర్మన్‌ సుఖ్వీందర్‌సింగ్‌లు ఉన్నారు. దేశాయ్‌ తరఫున మధ్యవర్తి జితేందర్‌ తన నివాసంలోలంచం మొత్తాన్ని అందుకుంటుండగా సీబీఐ అరెస్టు చేసింది. కాలేజీ యాజమాన్యం తరఫున కన్వల్‌జిత్‌ రూ.2కోట్లను జితేందర్‌కు ఇచ్చారు.

కేతన్‌, ఇతరుల అరెస్టు వివరాలను సీబీఐ ప్రతినిధి హరీష్‌ బాహల్‌ శుక్రవారం మీడియా ప్రతినిధులకు తెలిపారు. నిందితులకు ఢిల్లీలోను, ఢిల్లీవెలుపల ఉన్న ఇళ్లు, ఆస్తులపై సోదాలు ప్రారంభించినట్టు తెలిపారు. 2001లో అవినీతి ఆరోపణలపై ఢిల్లీహైకోర్టు తప్పుపట్టడంతో అప్పట్లో ఒకసారి ఎంసీఐ అధ్యక్షపదవి నుంచి కేతన్‌ తప్పుకున్నారు. తర్వాత మళ్లీ ఆ పదవిని చేజిక్కించుకున్నారు. అనేక వైద్య కళాశాలలకు అక్రమంగా అనుమతులిచ్చారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఎంసీఐ అధ్యక్షుడి బాగోతంపై ప్రధాని కార్యాలయం ఆరా తీసింది. వివరాలు తెలపాలని ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఆరోగ్య శాఖ మంత్రి ఆజాద్‌ మాత్రం ఎంసీఐ అధ్యక్షుడి నియామకం, తొలగింపులో ప్రభుత్వం పాత్ర ఉండదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X