వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెసులో గ్రూపులు లేవు: రోశయ్య
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యకర్తల కృషిని ఆయన అభినందించారు. ఈ పిసిసి సమావేశంలో సంస్థాగత ఎన్నికలపై చర్చించారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, ఎన్నికల అధికారి నాచప్పన్, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అనంతపురంలో వేయి ఎకరాల స్థలంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ తనకు ఓ లేఖలో తెలిపారని ఆయన అన్నారు. ఇందుకు ఆయన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Story first published: Saturday, April 24, 2010, 16:22 [IST]