వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసులో గ్రూపులు లేవు: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్ : తమ కాంగ్రెసు పార్టీలో గ్రూపులు లేవని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. పార్టీ సమైక్యంగా ఉందని, అందరూ కలిసి పనిచేస్తున్నారని ఆయన అన్నారు. శనివారం గాంధీభవన్ లో జరిగిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రజాపథంలో రోశయ్యకు పేరు రావడం లేదని, కాకినాడ ప్రజాపథంలో రోశయ్య చిత్రం లేదని కొందరు అన్నారు. దీనిపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని రోశయ్య చెప్పారు.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యకర్తల కృషిని ఆయన అభినందించారు. ఈ పిసిసి సమావేశంలో సంస్థాగత ఎన్నికలపై చర్చించారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, ఎన్నికల అధికారి నాచప్పన్, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అనంతపురంలో వేయి ఎకరాల స్థలంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ తనకు ఓ లేఖలో తెలిపారని ఆయన అన్నారు. ఇందుకు ఆయన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X