విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజారాజ్యం కృష్ణా కమిటీ ఖరారు

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విజయవాడ: ప్రజారాజ్యం పార్టీ కృష్ణాజిల్లా కమిటీ ఖరారైంది. మొదటిసారిగా చిరంజీవి జంబో కార్యవర్గాన్ని జిల్లాకు ప్రకటించనున్నారు. సుమారు 62 మందికి స్థానం కల్పించారు. నెలరోజుల క్రితమే జిల్లా అధ్యక్షుడుగా పెనమలూరు నియోజక వర్గానికి చెందిన ధనేకుల మురళీమోహన్ ను నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు.

ఈనెల రోజుల్లో మురళీ మోహన్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సమావేశాలు నిర్వహించారు. పార్టీలో చురుకుగా వ్యవహరించే వారిని గుర్తించి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన వివరాలు జిల్లా అధ్యక్షుడు ధనేకుల మురళీ మోహన్, ఎమ్మెల్యే యలమంచిలి రవి, అర్బన్ అధ్యక్షుడు బత్తిన రామ్మోహన్ తదితరులు ఆదివారం రాష్ట్ర కమిటీకి అందజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X