పోటీ నష్టం: తెలంగాణ కాంగ్రెసు నేతలు
సెంటిమెంట్ ఆధారంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకపోవడమే మంచిదని సీనియర్ నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి నివాసంలో జరిగిన తెలంగాణ సీనియర్ల కీలక సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కె.కేశవరావు, మాజీ మంత్రి కె.జానారెడ్డి, టీఆర్సీసీసీ కన్వీనర్ జి.చిన్నారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి, సీనియర్ నేతలు పాల్వాయి గోవర్ధనరెడ్డి, కె.ఆర్.ఆమోస్, కమలాకరరావు, కె.యాదవరెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీలో ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ, శ్రీకృష్ణ కమిటీ ముందు విన్పించే వాదనలు, ప్రాణహిత-చేవెళ్ల సహా సాగునీటి ప్రాజెక్టుల అంశాలు చర్చకు వచ్చాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు బరిలోకి దిగితే కేవలం రాజకీయ కోణం మాత్రమే ఉంటుందని భేటీలో పాల్గొన్న సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Monday, April 26, 2010, 8:36 [IST]