హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధరలపై పోరు ఆగదు: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ధరల పెరుగుదలపై తమ పోరాటం ఆగదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలపై చేపట్టిన హర్తాళ్ సందర్భంగా మంగళవారం ఆయన హైదరాబాదులోని గోషామహల్ లో మాట్లాడారు. ధరలు తగ్గించే వరకు తమ పోరాటం సాగుతుందని ఆయన అన్నారు. దేశంలో మన రాష్ట్రంలోనే ధరలు అధికంగా ఉన్నాయని ఆయన అన్నారు. హర్తాళ్ ను విజయవంతం చేసిన వ్యాపారవేత్తలకు, పార్టీల కార్యకర్తలకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అధికార దుర్వినియోగంతో ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేదని ఆయన అన్నారు. ప్రజలపై ప్రభుత్వానికి అభిమానం ఉంటే వెంటనే ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. లోపల ఉండాల్సినవారు వెలుపల, వెలుపల ఉండాల్సిన వారు లోపల ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. బ్లాక్ మార్కెటీర్లు దర్జాగా బయట తిరుగుతున్నారని ఆయన అన్నారు. స్మగ్లర్లు బయట ఉన్నారని ఆయన అన్నారు. సిపిఎం కార్యదర్సి బివి రాఘవులు కూడా మాట్లాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X