గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Guntur
గుంటూరు: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సంక్రాంతిపాడులో దారుణం జరిగింది. ఓ మహిళపై భర్త, అత్త కిరోసిన్ పోసి నిప్పంటించారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్న వారు మహిళపై మంగళవారం ఆ దారుణానికి ఒడిగట్టారు. స్రవంతి అనే ఆ మహిళ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడింది. ఆమెను నర్సారావుపేట ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శరీరం 99 శాతం కాలడంతో బతికే అవకాశాలు తక్కువని అంటున్నారు.

స్రవంతి అనే మహిళకు సురేష్ తో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. అప్పటి నుంచి కూడా ఆమెను భర్త, అత్త అదనపు కట్నం కోసం వేధిస్తూనే ఉన్నారు. తాజాగా బంగారు నగలు తేవాలని ఒత్తిడి తెచ్చారు. ఈ సమయంలో మంగళవారం వాగ్వివాదం చెలరేగింది. ఈ సమయంలో భర్త, అత్త ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X