వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దద్దరిల్లిన పార్లమెంటు ఉభయసభలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్, ఐపియల్ వివాదం, అధిక ధరలపై మంగళవారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. రాజ్యసభ రేపటికి వాయిదా పడగా, లోకసభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. తొలుత ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో లోకసభ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి. లోకసభలో ప్రతిపక్ష సభ్యులు అధిక ధరలపై నిరసన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) పై ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటు వెలుపల ప్రకటన చేయడాన్ని బిజెపి నేత సుష్మా స్వరాజ్ తప్పు పట్టారు.

అధిక ధరలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. సభ సమావేశం కాగానే సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, వామపక్షాల సభ్యులు అధిక ధరలకు నిరసనగా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పియల్ వ్యవహారంపై జెపిసి విచారణకు ఆదేశించాలని బిజెపి సభ్యులు పట్టుబట్టారు. దీంతో చైర్మన్ హమీద్ అన్సారీ సభను వాయిదా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X