అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కు పిసిసి ఇవ్వాల్సిందే: మారెప్ప

By Pratap
|
Google Oneindia TeluguNews

Mareppa
అనంతపురం: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా వైయస్ జగన్‌ ను ఎంపిక చేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి మూలింటి మారెప్ప అన్నారు. గురువారం ఆయన తన వ్యక్తిగత పనిమీద అనంతపురం జిల్లా గుంతకల్లుకు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారకు. రాష్ట్రంలోని దాదాపు 8 మంది ముఖ్యమంత్రుల కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగానూ, ఇతర మంత్రిపదవులను సమర్థవంతంగా నిర్వహించిన కొణిజేటి రోశయ్య ప్రస్తుతం ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు.

దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించడంలో ఆయన సఫలీకృతులవుతున్నారన్నారు. అదేవిధంగా వైయస్ జగన్‌ కు కూడా పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెడితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీకి ఎదురులేకుండా పోతుందని అన్నారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో వృద్ధులకు కాకుండా యువతరానికి, గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇవ్వాలని ఆయన కోరారు. మంత్రాలయం నియోజకవర్గంలో వృద్ధుడికి టిక్కెట్ ఇవ్వడం వల్లే అక్కడ కాంగ్రెసు పార్టీ ఓటమి పాలు కావాల్సి వచ్చిందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X