వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్మికులు విధుల్లో పట్టుదల చూపాలి: డిఎస్

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: హక్కుల సాధన కోసం కార్మికులు చూపుతున్న పట్టుదలనే బాధ్యతల నిర్వహణలో కూడా చూపాలని, అప్పుడే యాజమాన్యాలు దిగి వస్తాయని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ లో జరిగిన మేడే వేడుకలకు ఆయన హాజరయ్యారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఝానం పెరిగినప్పటికీ శ్రమశక్తీ ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గలేదని ఆయన అన్నారు.

సిపిఐ, సిపిఎంల ఆధ్వర్యంలో కూడా శనివారం హైదరాబాదులోని మేడే కార్యక్రమాలు జరిగాయి. ఈ రెండు పార్టీల కార్యకర్తలు విడివిడిగా ర్యాలీలు నిర్వహించారు. ప్రాంత, కుల, మత విభేదాలతో పేదలను చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X