విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగవైష్ణవి హత్య కేసులో చార్జిషీట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Naga Vaishnavi
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో పోలీసులు సోమవారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు మోర్ల శ్రీనివాస రావు, యంపరాల జగదీష్ లపై వారు నేర అభియోగపత్రాన్ని కోర్టుకు సమర్పించారు. తదుపరి విచారణ ఈ నెల 12వ తేదీకి వాయిదా పడింది.

కేసులో బలమైన ఆధారాలు లభించకపోవడంతో నిందితులను నార్కో అనాలిసిస్ పరీక్షల కోసం అహ్మదాబాద్ తరలించారు. విజయవాడకు చెందిన బిసి నేత ప్రభాకర్ కూతురు నాగవైష్ణవి దారుణ హత్యకు గురి కావడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. నాగవైష్ణవి హత్యకు గురైన విషయం తెలిసి ప్రభాకర్ హఠాన్మరణం చెందారు. ఈ సంఘటన ప్రజలను తీవ్రంగా కలచివేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X