వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ లోనే ముంబై దాడుల కుట్ర: జడ్జి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Terror Attacks
ముంబై: ముంబై దాడులకు పాకిస్తాన్ లోనే కుట్ర జరిగిందని నిందితుడు కసబ్ ను దోషిగా నిర్ధారిస్తూ సోమవారం వెలువరించిన తీర్పులో ప్రత్యేక న్యాయమూర్తి ఎంఎల్ తహిల్యానీ చెప్పారు. కసబ్ దేశంపై యుద్ధానికి దిగాడని వ్యాఖ్యానించింది.దాడులతో భారతీయులకు ఏ విధమైన సంబంధం లేదని తేల్చి చెప్పారు. న్యాయమూర్తి తీర్పును వెలువరించే సమయంలో కసబ్ ముఖంలో ఏ విధమైన భావనా వ్యక్తం కాలేదు.

కాగా, కసబ్ కు ఉరిశిక్ష విధించే విషయంపై రేపు కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కసబ్ కు రేపు గానీ ఎల్లుండి గానీ శిక్షను ఖరారు చేసే అవకాశం ఉంది. కసబ్ పై వెలువరించే తీర్పు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. కసబ్ సొంత పట్టణం ఫరీద్ కోటలో కూడా తీర్పుపై ఆసక్తి నెలకొంది. ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X