చిరు పర్యటన సీమాంధ్ర కుట్ర: నాయని
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే విషయంపై, రాబోయే ఉప ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో విజయం సాధించడానికి అవసరమైన వ్యూహరచనపై సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ నేతృత్వంలో జరిగిన పొలిట్బ్యూరో సమావేశంలో చర్చించారు. ఇటీవల జరిగిన తెరాస తొమ్మిదో వార్షికోత్సవంలో పార్టీ సంస్థాగత నిర్మాణానికి ప్రతినిధులు చేసిన సూచనలను పొలిట్బ్యూరో సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు.
ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలు బాగానే ఉన్నప్పటికీ పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాన్ని పట్టించుకోలేదని, దీన్ని అధిగమించాలని పలువురు సభ్యులు సూచించారు. ఉప ఎన్నికలకు ముందే ఈ కార్యక్రమం పూర్తికావాలన్నారు. ఈ నెల 31లోపు సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నిర్మాణం పూర్తిచేయాలని నిర్దేశించుకున్నారు. ఉప ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో జూన్ 3లోపు మండలాలు, గ్రామాల వారీగా ఇన్ఛార్జిలను నియమించనున్నారు. వీరు జూన్ 3 నుంచి 10 వరకు పల్లెబాట కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో కనీసం ఎనిమిది లక్షల మంది విద్యార్థులను చేర్చుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు.
సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణ కార్యక్రమాలకు జిల్లాకో కన్వీనరును నియమించాలని నిర్ణయించారు. వారి పేర్ల ప్రకటన బాధ్యతను కేసీఆర్కే అప్పగిస్తూ సభ్యులు తీర్మానం చేశారు. ఒకట్రెండు రోజుల్లో కన్వీనర్లను ప్రకటిస్తామని పార్టీ పొలిట్బ్యూరో తెలిపింది. కన్వీనర్ల నియామక ప్రక్రియను ఈ నెల 10లోపు పూర్తిచేసి వారికి హైదరాబాద్లో సమావేశం నిర్వహించాలని కూడా తీర్మానించారు.