వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడ్డుకుంటే అభివృద్ధి కష్టం: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
విశాఖపట్నం: ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటే అభివృద్ధి జరగదని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. విశాఖపట్నం జిల్లాలో ఆయన రెండో రోజు పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన పద్మనాభం గ్రామంలో ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రజా పథం కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. పని చేయాలనుకునే మహిళలకు, పని లేని పురుషులకు అడిగితే పని కల్పించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని కల్పన ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో ఆధారపడి లేదని, అది కేంద్ర కల్పించిన హక్కని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతకు ముందు డిఎస్పీ అభ్యర్థుల పోస్టులు భర్తీ చేయాలంటూ అభ్యర్థులు పెద్ద యెత్తున నినాదాలు చేశారు. అర్హులైనవారందరికీ న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. దీంతో వారు అందోళన విరమించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X