వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెర్రరిస్టు కసబ్ కు ఉరిశిక్ష ఖరారు

By Santaram
|
Google Oneindia TeluguNews

Ajmal Kasab
ముంబై: ముంబై మహానగరంపై విరుచుకుపడి, మారణహోమం సృష్టించిన ఉగ్రవాది, నరరూప రాక్షసుడు అజ్మల్‌ కసబ్‌కు ఉరిశిక్ష పడింది. ముంబయి మరణకాండలో దోషిగా తేలిన కసబ్‌కు మరణశిక్ష విధిస్తూ ఆర్థర్‌ రోడ్డులోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తహిల్యాని గురువారం తీర్పు చెప్పారు. కసబ్‌పై నమోదయిన మరో ఐదు కేసుల్లో అతనికి యావజ్జీవ శిక్ష విధించారు.

నరరూప రాక్షసుడి అవతారమెత్తి అమాయకులను పొట్టనపెట్టుకున్న కసబ్‌ భవిష్యత్‌లో మారతాడన్న నమ్మకం తనకు ఏమాత్రం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ కిరాతకుడికి మరణ దండన కాకుండా మరే శిక్ష విధించిన న్యాయవ్యవస్థపై సామాన్యుడికి నమ్మకం పోతుందన్నారు. ముంబై మారణహోమం మాటల్లో వర్ణించలేని ఘోరకృత్యమని అన్నారు.

తహిల్యాని తీర్పును హిందీలో చదివి కసబ్‌కు వినిపించారు. తీర్పు వింటూనే కసబ్‌ కంటతడి పెట్టాడు. తనకు గ్లాసు మంచినీళ్లు కావాలని అడిగాడు. ఇంకా ఏమైనా కావాలా? అని అడగ్గా దిగ్భ్రాంతికి గురయినట్టుగా ముఖంపెట్టాడు. తర్వాత అతడిని పోలీసులు కోర్టు నుంచి జైలుకు తరలించారు. మరోవైపు కసబ్‌కు మరణశిక్ష విధించడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X