రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: స్థానిక సంస్థల కోటా కింద హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించి శుక్రవారం ఉదయం పోలింగ్‌ ప్రారంభమైంది. మూడు స్థానాల్లో రెండు హైదరాబాద్‌ జిల్లాకు చెందినవి కాగా ఒక్కటి రంగారెడ్డి జిల్లాకు చెందినది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. స్థానిక సంస్థల కోటాలో ఎన్నిక జరగనున్న దృష్ట్యా ఆ సంస్థల ప్రజాప్రతినిధులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

హైదరాబాద్‌ జిల్లాలోని రెండు స్థానాలకు 157 మంది, రంగారెడ్డి జిల్లాలో ఒక స్థానానికి 653 మంది ఓటర్లుగా ఉన్నారు. హైదరాబాద్‌ జిల్లాకు రెండు, రంగారెడ్డి జిల్లాకు మూడు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు తొలి ఓటు వేశారు. కాంగ్రెసుకు సంబంధించి ఓటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. హైదరాబాదులో కాంగ్రెసుకు స్పష్టమైన మెజారిటీ ఉంది. దీంతో తెలుగుదేశం అభ్యర్థి పెద్దగా ఎన్నికపై ఆసక్తి చూపడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X