ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్ జిల్లాలోని రెండు స్థానాలకు 157 మంది, రంగారెడ్డి జిల్లాలో ఒక స్థానానికి 653 మంది ఓటర్లుగా ఉన్నారు. హైదరాబాద్ జిల్లాకు రెండు, రంగారెడ్డి జిల్లాకు మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు తొలి ఓటు వేశారు. కాంగ్రెసుకు సంబంధించి ఓటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. హైదరాబాదులో కాంగ్రెసుకు స్పష్టమైన మెజారిటీ ఉంది. దీంతో తెలుగుదేశం అభ్యర్థి పెద్దగా ఎన్నికపై ఆసక్తి చూపడం లేదు.
Comments
Story first published: Friday, May 7, 2010, 9:25 [IST]